ముంబైలోని ఎల్పిన్స్టోన్ రైల్వేస్టేషన్లో నిన్న మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి నేడు కేఈఎం ఆస్పత్రిలో మృతిచెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరినట్టయింది. ఇవాళ మృతిచెందిన వ్యక్తిని సత్యేంద్ర కుమార్ కనోజియాగా గుర్తించినట్టు కేఈఎం ఆస్పత్రి డీన్ అవినాష్ సూపే తెలిపారు. దుర్ఘటనలో గాయపడినప్పటి నుంచే అతడిని ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందించామని, తమ వంతు ప్రయత్నం తాము చేసినప్పటికీ అతడిని కాపాడలేకపోయామని డీన్ ఆవేదన వ్యక్తంచేశారు.
తొక్కిసలాటలో గాయపడిన వారిలో 38 మందిని కేఈఎం ఆస్పత్రిలోనే చేర్పించినట్టు డీన్ మీడియాకు వెల్లడించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 8 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తొక్కిసలాటలో గాయపడిన వారిలో 38 మందిని కేఈఎం ఆస్పత్రిలోనే చేర్పించినట్టు డీన్ మీడియాకు వెల్లడించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 8 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.