యాప్నగరం

ముంబై తొక్కిసలాటలో 23కి చేరిన మృతుల సంఖ్య

ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది.

TNN 30 Sep 2017, 7:45 pm
ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి నేడు కేఈఎం ఆస్పత్రిలో మృతిచెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరినట్టయింది. ఇవాళ మృతిచెందిన వ్యక్తిని సత్యేంద్ర కుమార్ కనోజియాగా గుర్తించినట్టు కేఈఎం ఆస్పత్రి డీన్ అవినాష్ సూపే తెలిపారు. దుర్ఘటనలో గాయపడినప్పటి నుంచే అతడిని ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందించామని, తమ వంతు ప్రయత్నం తాము చేసినప్పటికీ అతడిని కాపాడలేకపోయామని డీన్ ఆవేదన వ్యక్తంచేశారు.
Samayam Telugu death toll in stampede at railway station rises to 23
ముంబై తొక్కిసలాటలో 23కి చేరిన మృతుల సంఖ్య


తొక్కిసలాటలో గాయపడిన వారిలో 38 మందిని కేఈఎం ఆస్పత్రిలోనే చేర్పించినట్టు డీన్ మీడియాకు వెల్లడించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 8 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.