యాప్నగరం

Kerala Boat Tragedy: ఏడుగురు చిన్నారుల సహా 22కి చేరిన మృతులు

Kerala Boat Tragedy కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. తనూర్‌ పట్టణ తువల్‌తీరం బీచ్‌ వద్ద ప్రయాణికులతో వెళుతున్న హౌస్‌బోట్‌ బోల్తాపడి మునిగిపోయింది. ఈ ఘటనలో చాలా మంది మృతిచెందారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో వీరంతా విహారయాత్రకు వచ్చి ప్రమాదంలో పడ్డారు. కేరళ క్రీడల మంత్రి వి.అబ్దు రహిమాన్‌, పర్యాటకశాఖ మంత్రి పి.ఎ.మహమ్మద్‌ రియాజ్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 8 May 2023, 1:52 pm

ప్రధానాంశాలు:

  • ప్రమాదానికి గురైన డబుల్ డెక్కర్ పడవ
  • సామర్ధ్యానికి మించి ఎక్కించినట్టు వెల్లడి
  • సెఫ్టీ చర్యలు గాలికొదిలేసినట్టు గుర్తింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. మలప్పురం జిల్లా తూవల్‌తీరం తనూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. టూరిస్టులతో ఉన్న పడవ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. సామర్ధ్యానికి మించి బోటులో పర్యాటకులను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. బోటు యజమానిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాద సమయానికి బోటులో ఎంత మంది ఉన్నారనేది మాత్రం స్పష్టత లేదు. 40 మంది టిక్కెట్లు తీసుకోగా.. కొందరు టిక్కెట్ లేకుండా ఎక్కినట్టు తెలుస్తోంది. అంతేకాదు, పడవకు ఎటువంటి సేఫ్టీ సర్టిఫికెట్ లేదని గుర్తించారు.
గల్లైంతన వారికోసం అండర్ వాటర్ కెమెరాల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సహా పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2.2 లక్షలు ఆర్ధిక సాయం ప్రధాని ప్రకటించారు.

‘మలప్పురంలో పడవ ప్రమాదం ఘటన వార్త తీవ్రంగా కలిచివేసింది.. విషాదకర ఘటనలో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు కాంగ్రెస్ కార్యకర్తలు సాయం చేయాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఘటనా స్థలాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సోమవారం సందర్శించనున్నారు. అంతేకాదు, ఘటనకు సంతాపంగా సోమవారం జరగాల్సి అన్ని ప్రభుత్వం కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.