యాప్నగరం

సుఖోయ్‌లో సీతారామన్.. ఫైటర్‌ జెట్ ఎక్కిన రక్షణ మంత్రి

రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు.

TNN 17 Jan 2018, 4:35 pm
రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌ ఎయిర్ బేస్ నుంచి ఆమె సుఖోయ్ యుద్ధ విమానంలో గగనతలంలోకి ఎగిరిపోయారు. జి-షూట్ ధరించి.. పైలట్ వెనకాల సీట్లో కూర్చొని నిర్మల ప్రయాణించారు. యుద్ధ సమయంలో సుఖోయ్ విమానాలు ఏ విధంగా దాడులు చేస్తాయో రక్షణ మంత్రి స్వయంగా తెలుసుకున్నారు. సుఖోయ్‌లో ప్రయాణించిన అనంతరం ఆమె తన అనుభవాన్ని వ్యక్తపరిచారు.
Samayam Telugu defence minister nirmala sitharaman flew a sortie on the sukhoi 30 mki
సుఖోయ్‌లో సీతారామన్.. ఫైటర్‌ జెట్ ఎక్కిన రక్షణ మంత్రి


‘చాలా గర్వంగా ఉంది. నాకు ఇంత గొప్ప అనుభూతిని అందించిన ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి కృతజ్ఞతలు. దృఢత్వం, ప్రాక్టీస్, సంసిద్ధత, పరిస్థితులకు అనుగుణంగా భద్రతా సిబ్బంది ఎలా స్పందిస్తారు వంటి విషయాలను అర్థం చేసుకుని నాకు నేనే చెప్పుకున్నాను. నేను రెప్ప వాల్చలేదు. ఇదో జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని నిర్మాలా సీతారామన్ చెప్పారు. సుఖోయ్ 30 ఎంకేఐ అణు సామర్థ్యమున్న ఎయిర్‌క్రాఫ్ట్. ఇది శత్రు భూభాగంలోకి చొచ్చుకు పోయి విధ్వంసం సృష్టించగలదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.