యాప్నగరం

మతాంతర ప్రేమ.. యువకుడి హత్య

ప్రియురాలి తల్లిదండ్రుల చేతిలో ప్రియుడు హత్యకు గురైన సంఘటన ఢిల్లీలో జరిగింది. తమ కూతురితో హిందూ యువకుడు చెట్టాపట్టాలేసుకొని తిరగడం పట్ల ఆగ్రహించిన యువతి కుటుంబసభ్యులు గొంతు కోసి హత్య చేశారు.

TNN 3 Feb 2018, 11:27 pm
దేశ రాజధాని ఢిల్లీలో మరో పరువు హత్య జరిగింది. తమ కూతురితో మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడు చెట్టాపట్టాలేసుకొని తిరగడం పట్ల ఆగ్రహించిన యువతి కుటుంబసభ్యులు సదరు యువకుడిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలోని ఖాయాల ప్రాంతంలో శుక్రవారం (ఫిబ్రవరి 2) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అంకిత్ సక్సేనా (23) అనే యువకుడు ముస్లిం వర్గానికి చెందిన షెహ్‌జాదీ (20) అనే యువతితో గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.
Samayam Telugu delhi 23 year old stabbed to death over love affair
మతాంతర ప్రేమ.. యువకుడి హత్య


వారిద్దరి సంబంధం గురించి షెహ్‌జాదీ ఇంట్లో తెలియడంతో ఆమెను హెచ్చరించారు. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో ఉన్న వారిద్దరూ తమ ప్రవర్తన మార్చుకోకపోవడంతో యువతి తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. వారిద్దరూ వివాహం చేసుకుంటే తమ పరువుకు భంగం కలుగుతుందని భావించారు.

అంకిత్ నివాసానికి సమీపంలో ఉన్న ఆ ప్రేమ జంటను శుక్రవారం సాయంత్రం షెహ్‌జాదీ కుటుంబసభ్యులు మరోసారి గుర్తించారు. అక్కడికి చేరుకున్న యువతి సోదరుడు, మేనమామ ఆగ్రహంతో అంకిత్‌ను గొంతు కోసి చంపేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి సోదరుడు మైనర్ కావడంతో.. అతణ్ని జువైనల్ హోమ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.