యాప్నగరం

సచివాలయం సాక్షిగా.. సీఎం కారు చోరీ!

దేశ రాజధానిలో.. సాక్షాత్తూ సీఎం కారునే దొంగలు చోరీ చేశారు. అది కూడా సచివాలయం బయట నిలిపిన సమయంలో కావడం గమనార్హం.

TNN 13 Oct 2017, 12:54 am
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. 2015 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఆయన ఉపయోగించిన బ్లూ కలర్ వ్యాగన్ ఆర్ కారు దొంగతనానికి గురైంది. ఢిల్లీ సచివాలయం బయట నిలిపిన సీఎం కారును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆమ్ ఆద్మీ బొమ్మతో ఉన్న ఈ కారును ప్రస్తుతం ఆప్ మీడియా సమన్వయం చేసే వందనా సింగ్.. పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు. సెక్రటేరియట్ బయట నిలిపి ఉంచిన ఈ కారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మిస్సయినట్లు గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Samayam Telugu delhi chief minister arvind kejriwals blue wagon r stolen near secretariat
సచివాలయం సాక్షిగా.. సీఎం కారు చోరీ!


ఈ కారును 2013లో కుందన్ శర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేజ్రీవాల్‌కు ఇచ్చారు. కారు చోరికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తమకు ఫిర్యాదు అందిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ మన్‌దీప్ రద్వానా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.