యాప్నగరం

ఎప్పటికీ ఉద్యోగాలు ఇవ్వరు.. ఆ పార్టీకి నిరుద్యోగ గూండాలు కావాలి : అరవింద్ కేజ్రీవాల్

హర్యాణాలో ఎన్నికల ర్యాలీలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో పాఠశాలలను అభివృద్ధి చేశామని, అలాగే అవకాశం ఇస్తే హార్యాణాలో కూడా చేస్తామని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ పార్టీ పిల్లలను గూండాలు, రేపిస్టులుగా మారుస్తుందని విమర్శించారు. పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకునేవాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీతో కలసి రావాలని ప్రజలను కోరారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 29 May 2022, 4:47 pm

ప్రధానాంశాలు:

  • బీజేపీపై మండిపడ్డ సీఎం కేజ్రీవాల్ విమర్శలు
  • హర్యాణాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
  • హర్యాణాలో అవినీతి లేకుండా చేస్తామని హామీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఎప్పటికీ ఉద్యోగాలు ఇవ్వరు.. ఆ పార్టీకి నిరుద్యోగ గూండాలు కావాలి : అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. హర్యాణాలోని కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన బీజేపీని టార్గెట్ చేశారు. 2024 హర్యాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆయన ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గొప్పగా మార్చిందని అన్నారు. ప్రస్తుతం అక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఎంతో రాణిస్తున్నారని చెప్పారు. "ఈ ఏడాది నాలుగు లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను విడిచిపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు." అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
తాను ఓ సాధారణ వ్యక్తినని, తనకు రాజకీయాలు తెలియవని సీఎం కేజ్రీవాల్ అన్నారు. తాను ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచానని, ఈసారి పాఠశాలలు 99.7 శాతం ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు. మెలినియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వచ్చారని గుర్తు చేశారు. తమకు అవకాశం దొరికితే హర్యాణాలోనూ ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునే వారు మాతో రావాలని ఆయన పిలుపునిచ్చారు.

"ఎవరైతై తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునే వారు మాతో రండి. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులు కావాలని కోరుకునే వారు వారితో (బీజేపీ) వెళ్లండి. ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయి." అని కేజ్రీవాల్ అన్నారు. ఆ పార్టీకి నిరుద్యోగ గూండాలు అవసరం కాబట్టి వారు మీ పిల్లలకు ఎప్పటికీ ఉద్యోగాలు ఇవ్వరని, వారు మీ పిల్లలకు అల్లర్లు నేర్పుతారని, వారి పిల్లలను విదేశాలకు పంపుతారని ఆయన విమర్శించారు.

హర్యాణాలో అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్‌ను అందిస్తానని, అవినీతిని తుడిచిపెట్టేస్తానని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా నిజాయితీ గల పార్టీ అని, నా కొడుకు తప్పు చేసినా అతడిని విడిచిపెట్టనని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లో అవినీతిని అంతం చేశామని, ఇప్పుడు హర్యానా వంతు వచ్చిందన్నారు. ఇదే సందర్భంలో ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని తనను మీడియా అడుగుతుందని, పొత్తులు ఎలా కుదుర్చుకోవాలని తనకు తెలియదని కేజ్రీవాల్ అన్నారు. ఈ దేశంలో ప్రజలు, రైతులు, కార్మికులు, వైద్యులతో మైత్రిని ఏర్పరచుకుని, బలమైన దేశంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.