యాప్నగరం

'ఆప్'తో పొత్తు ప్రసక్తే ఉండదు: మాకెన్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ'తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ అన్నారు.

Samayam Telugu 2 Jun 2018, 10:35 pm
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ'తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ అన్నారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించడంతో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయనే ప్రచారం మొదలైంది. అయితే కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని ఖండించింది. దీనిపై ఢిల్లీ పీసీసీ చీఫ్‌ అజయ్‌ మాకెన్‌ శనివారం (జూన్ 2) స్పందిస్తూ.. అన్నా హజారే ఉద్యమం సమయంలో ఆరెస్సెస్‌కు అనుకూలంగా పనిచేసిన కేజ్రీవాల్‌తో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Samayam Telugu maken


ఢిల్లీవాసుల్లో ఆమ్ ఆద్మీపార్టీకి, కేజ్రీవాల్‌కు ఆదరణ తగ్గుతోందని ఢిల్లీ శాసనసభ ఉపఎన్నికలు, నగర పాలక ఎన్నికల్లోనే స్పష్టమైందని ఆయన అన్నారు. ప్రజలు ఆప్‌ను విశ్వసించడంలేదని, అలాంటి పార్టీతో తాము జట్టుకట్టాల్సిన అవసరమే రాదన్నారు. 2012- 13లో అన్నాహజారే పోరాట సమయంలో కిరణ్‌ బేడీ, బాబా రాందేవ్‌, జనరల్‌ వీకేసింగ్‌తో కలిసి ఆరెస్సెస్‌, భాజపాకు అనుకూలంగా పనిచేసి మోదీని అరవింద్‌ కేజ్రీవాలే తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. మోదీని ఎదిగేలా చేసిందే కేజ్రీవాల్ అని మాకెన్ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.