యాప్నగరం

సీఎస్‌పై ఎమ్మెల్యేల దాడి.. వివాదంలో ఆప్ సర్కార్

ఆప్ ప్రభుత్వం మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ఈసారి ఎమ్మెల్యేలు నేరుగా సీఎస్‌పై దాడి చేశారని ఆరోపించడం సంచలనం రేపింది. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాడి జరగలేదని ప్రకటించిన సీఎం ఆఫీస్

TNN 20 Feb 2018, 2:01 pm
ఆప్ ప్రభుత్వం మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ఈసారి ఎమ్మెల్యేలు నేరుగా సీఎస్‌పై దాడి చేశారని ఆరోపించడం సంచలనం రేపింది. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఓ సమీక్షా సమావేశం జరిగింది. దీనికి సీఎస్ అన్షు ప్రకాష్, కొంతమంది అధికారులు, ఆప్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా... లెఫ్టినెంట్ గవర్నర్ పేరు ప్రస్తావనకు వచ్చిందట. వెంటనే ఎమ్మెల్యేలు- అధికారుల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇంతలో ఓ ఎమ్మెల్యే బూతులు తిడుతూ... ఆగ్రహంతో ఊగిపోయి సీఎస్‌పై చేయి చేసుకున్నాడట. మరో ఎమ్మెల్యే కూడా ఆయనపై దాడి చేశాడట. వెంటనే మిగిలిన ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో గొడవ సద్ధుమణిగింది.
Samayam Telugu delhi cs allegedly manhandled by aap mlas cmo rubbishes claim
సీఎస్‌పై ఎమ్మెల్యేల దాడి.. వివాదంలో ఆప్ సర్కార్



ఈ ఘటనపై సీఎస్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై సీఎం ఆఫీస్ స్పందించింది. సీఎస్‌పై ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. ఇదిలా ఉంటే... అన్షునే తమతో అనుచితంగా ప్రవర్తించారంటూ రివర్స్‌లో ఎమ్మెల్యేలిద్దరూ... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట. ఈ గొడవ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాధ్యతగల వ్యక్తులే... ఇలా దాడులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు ఐఏఎస్‌ల అసోసియేషన్ కూడా సమావేశమై... ఈ వ్యవహారంపై చర్చించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.