యాప్నగరం

ఢిల్లీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్

Aam Admi Pary కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Samayam Telugu 14 Sep 2020, 8:12 pm
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్దిగా జ్వరంగా అనిపించడంతో టెస్టు చేయించుకోగా.. పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తనకు జ్వరం కూడా లేదని పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. మీ ఆశీర్వాదాలతో త్వరలోనే కోలుకుంటానని సిసోడియా ట్వీట్ చేశారు.
Samayam Telugu manish sisodia


సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగ్గా.. జ్వరం కారణంగా సిసోడియా ఈ సమావేశానికి హాజరు కాలేదు. డిప్యూటీ సీఎంకు జ్వరంగా ఉందని.. ఆయన సమావేశానికి హాజరు కావడం లేదని స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఈ రోజు ఉదయం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్చి 23న ఢిల్లీ అసెంబ్లీ ఒక్క రోజు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఢిల్లీలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 2.21 లక్షలు దాటింది. ఇందులో 1.88 లక్షల మంది కోలుకోగా... 4770 మంది చనిపోయారు. దేశ రాజధానిలో ప్రస్తుతం 28,641 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఢిల్లీలో 44,884 కరోనా టెస్టులు చేయగా.. 3374 పాజిటివ్‌గా తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.