యాప్నగరం

క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం

రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న సీఎం కేజ్రివాల్‌తోపాటు దీక్షచేస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోగ్యం సోమవారం (జూన్ 18) క్షీణించింది.

Samayam Telugu 18 Jun 2018, 9:22 pm
రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో సీఎం కేజ్రివాల్‌తోపాటు నిరాహార దీక్షచేస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోగ్యం సోమవారం (జూన్ 18) క్షీణించింది. రాజ్‌నివాస్‌లో సిసోడియాకు పరీక్షలు జరిపిన వైద్యులు కీటోన్స్ లెవల్స్ 7.4 స్థాయికి పడిపోయాయని చెప్పడంతో.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీక్ష కారణంగా అనారోగ్యం పాలైన మంత్రి సత్యేంద్రజైన్‌ను ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. జైన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Samayam Telugu ManishSisodiahealth


మరోవైపు సీఎం కేజ్రీవాల్ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఢిల్లీ సీఎంతో చర్చలు జరిపేందుకు ఐఎఎస్‌లు సంసిద్దతను ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.