యాప్నగరం

Satyendar Jain: జైలు బాత్రూమ్‌లో జారిపడ్డ సత్యేంద్ర జైన్.. ఆప్ నేత ఆరోగ్యం ఆందోళనకరం

Satyendar Jain గతేడాది మే నెలలో మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్‌లో ఆయన ఆరోగ్య, జైళ్ల శాఖలను నిర్వహించారు. ఏడాది నుంచి ఆయన జైల్లో ఉండగా.. ఒంటరిగా ఫీలవుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బెయిల్ కోసం ఆయన చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదు. సుప్రీం కోర్టులో ఈ నెల బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 May 2023, 4:44 pm

ప్రధానాంశాలు:

  • ఏడాది నుంచి తిహార్ జై‌లులో సత్యేందర్ జైన్
  • మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ
  • బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jain
తీహార్‌ జైలులో (Tihar Jail) ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Satyendar Jain) బాత్రూమ్‌లో కాలుజారి కిందపడ్డారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఆయనను.. చికిత్స కోసం దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి సత్యేందర్ జైన్‌ జైలు బాత్రూమ్‌లో జారిపడ్డారని జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తొలుత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సత్యేంద్ర జైన్‌కు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స అందుతోందని పేర్కొన్నాయి. మరోవైపు, మాజీ మంత్రి ఆరోగ్యంపై ఆప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రెండు రోజుల కిందట కూడా సత్యేంద్ర జైన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఆయనను సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రికి (Safdarjung Hospital) తరలించిన విషయం తెలిసిందే. జైలులో ఒంటరితనం వల్ల తాను ఆందోళనకు గురవుతున్నట్టు ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలుసార్లు బెయిల్‌ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దిగువ కోర్టులో ఊరట దక్కడకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైన్‌ ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.

క‌స్టడీలో ఉన్న స‌త్యేంద్ర జైన్ ఏకంగా 35 కిలోల బ‌రువు త‌గ్గార‌ని పేర్కొన్నారు. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో గ‌త ఏడాది మే 31న ఈడీ అధికారులు జైన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాజీ మంత్రి తిహార్ జైలులో ఉన్నారు. ఆయనను ప్రత్యేకంగా ఓ సెల్‌లో ఉంచడం వల్ల ఒంటరిగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనుకు తోడుగా వైద్యుడి సూచన మేరకు కాలక్షేపం కోసం మరో ఇద్దరు ఖైదీలను తన సెల్ లో ఉంచాలని ఈనెల 11న సత్యంద్ర జైన్ లేఖ రాశారు. ఆయన అభ్యర్థన మేరకు నెం. 7 జైలు సూపరింటెండెంట్ ఇద్దరు ఖైదీలను ఆయన సెల్‌కి మార్చారు.

ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరు ఖైదీలను వెంటనే తిరిగి వారి సెల్‌కు తరలించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సత్యేంద్ర సెల్‌కు ఖైదీలను తరలించడంతో సూపరింటెండెంట్‌పై చర్యలకు ఆదేశించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.