యాప్నగరం

చలితో వణుకుతున్న ఢిల్లీ.. 11 ఏళ్లలో కనిష్ఠ ఉష్ణోగ్రత

Delhi: దేశ రాజధానిపై చలి పంజా విసురుతోంది. అక్టోబర్ మాసంలో గత 11 ఏళ్లలో మంగళవారం (అక్టోబర్ 20) కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలితో పాటు శీతల గాలులు వణికిస్తున్నాయి.

Samayam Telugu 21 Oct 2020, 11:04 pm
గాలి కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీపై చలి పంజా విసురుతోంది. అక్టోబర్‌లో ఎన్నడూ లేనంత తక్కువ ఉష్ణోగ్రతలు, శీతల గాలులతో దేశ రాజధాని వణికిపోతోంది. మంగళవారం (అక్టోబర్ 20) రాత్రి ఢిల్లీలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. 11 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. సాధారణంగా అక్టోబర్ మాసంలో ఉష్ణోగ్రతలు 18.1 నుంచి 19.4 మధ్య నమోదవుతుండగా.. గత రాత్రి అంతకంటే 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా నాలుగు డిగ్రీలు తక్కువగా రికార్డైంది.
Samayam Telugu ఢిల్లీపై చలి పంజా
Coldest Delhi


చలితో పాటు శీతల గాలులు ఢిల్లీ ప్రజలను వణికించాయి. చలి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మంటలు వేసుకున్నారు. బుధవారం ఉదయం చాలా సేపటి వరకు మంచు దుప్పటి కమ్మేసింది. రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.


దేశ రాజధానిలో చివరిసారిగా 2009 అక్టోబర్‌ 26, 28 తేదీల్లో ఉష్ణోగ్రత 13.5 డిగ్రీలకు పడిపోయింది. మంగళవారం గంటకు 15-16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

Also Read:

వామ్మో! దీపికా పదుకొనె ఓ వలస కూలీ.. ఆ పథకం కింద లక్షలు స్వాహా!

ఎంత ఘోరం.. బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టారు, ఊపిరాడక మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.