యాప్నగరం

చలి గుప్పెట్లో ఉత్తరాది.. గత వందేళ్లలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైన నెలగా డిసెంబరు

గత రెండు వారాలుగా ఉత్తారాదిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, హర్యానా, రాజస్థాన్‌లు చలిగుప్పెట్లో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల జనం ఇళ్ల నుంచి రాలేని పరిస్థితి ఉంది.

Samayam Telugu 27 Dec 2019, 12:06 pm
ఉత్తరాదిపై చలి పంజా విసురుతోంది. చలిగాలులు, దట్టంగా కురుస్తున్న మంచుతో ఉత్తరభారతావని వణుకుతోంది. ముఖ్యంగా, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోవడంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఢిల్లీలో ఈ ఏడాది డిసెంబరు గత శతాబ్దంలోనే రెండో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డులకెక్కింది. గతంలో దేశ రాజధానిలో 1997 డిసెంబరు సరాసరి ఉష్ణోగ్రతలు 17.3 డిగ్రీలు సెల్సియస్... 1901 నుంచి ఇదే ఇప్పటి వరకు ఉన్న అత్యల్ప ఉష్ణోగ్రతని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Samayam Telugu delhi


ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్‌లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువ ఉందని తెలిపింది. చురు, లక్నో, బహరైచ్, గువాహటి, గ్వాలియర్, డెహ్రాడూన్, చంఢీఘడ్, పాటియాలా ప్రాంతాల్లో మంచు విస్తారంగా కురుస్తోంది. పశ్చిమబెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, త్రిపుర, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. చలిగాలులతో ఉత్తరాది ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఇదిలా ఉండగా, మరో రెండు మూడు రోజులు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు, ఉపరితల ద్రోణి ప్రభావంతో డిసెంబరు 31 నుంచి జనవరి 3 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లోని ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీల దిగువన నమోదవుతున్నాయి. డిసెంబరు 29 వరకు శీతల గాలులు, పొంగమంచు ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.