గత 140 ఏళ్లలో ఎన్నడూ ఎరగని రీతిలో తమిళనాడు తీవ్ర క్షామాన్ని ఎదుర్కొంటోంది. అన్నం పెట్టే రైతన్న అప్పుల బాధ తాళలేక.. దిక్కుతోచని స్థితిలో తనువు చాలిస్తున్నాడు. 60 శాతం లోటు వర్షపాతంతో తమిళ రైతులు కుదేలవుతున్నారు. తమను ఆదుకోవడం కోసం.. రైతు రుణాలను మాఫీ చేయాలని, రూ. 40 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనలు చేపడుతున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న తన గోడు వెళ్లబోసుకుంటున్న తీరు చూసి ఢిల్లీలోని సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కరిగిపోయింది.
తమ భాష కాదు, ఎక్కడ తినాలో, ఏం తినాలో తెలీదు.. అయినా తమిళ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. వీరి వెతలను చూసిన బంగ్లా సాహిబ్ గురుద్వారా తనకు చేతనైన సాయం చేస్తోంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు రోజూ రెండు పూటల భోజనం పెడుతూ వారి కడుపు నింపుతోంది. వంద రోజులకు పైగా ఢిల్లీలోనే ఉండి నిరసన తెలుపుతున్న రైతులకు అండగా నిలుస్తోంది.
లంగర్ అని పిలిచే ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా ఈ గురుద్వారా రోజూ పదివేల మంది ఆకలి తీరుస్తోంది. అందుకోసం సిద్ధం చేసిన చపాతీలనే తమిళ రైతులకు కూడా రోజూ రెండు పూటలా అందించేవారు. కానీ అన్నం తినడాన్నే రైతన్నలు ఇష్టపడతారని తెలుసుకొని వీరికోసం ప్రత్యేకంగా అన్నం వండించి మరీ వడ్డిస్తోంది. వరిసాగు ద్వారా తమిళనాడు మొత్తానికి అన్నం పెట్టిన తంజావురు జిల్లా రైతులకు సైతం.. ఇప్పుడు ఆ గురుద్వారానే పెద్ద దిక్కుగా మారింది. అవసరమైతే రైతన్నలకు వసతి కల్పించేందుకు కూడా ఆ గురుద్వారా ముందుకొస్తోంది. గురుద్వారా వాలంటీర్లే తమను దేవుడిలా ఆదుకుంటున్నారని, తమ ఇంట్లో వాళ్ల ఆకలి చూడలేక రోడ్డెక్కిన తమకు వారే భోజనం పెడుతున్నారంటూ తమిళ రైతులు కృతజ్ఞతా భావాన్ని చాటుతున్నారు.
తమ భాష కాదు, ఎక్కడ తినాలో, ఏం తినాలో తెలీదు.. అయినా తమిళ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. వీరి వెతలను చూసిన బంగ్లా సాహిబ్ గురుద్వారా తనకు చేతనైన సాయం చేస్తోంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు రోజూ రెండు పూటల భోజనం పెడుతూ వారి కడుపు నింపుతోంది. వంద రోజులకు పైగా ఢిల్లీలోనే ఉండి నిరసన తెలుపుతున్న రైతులకు అండగా నిలుస్తోంది.
లంగర్ అని పిలిచే ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా ఈ గురుద్వారా రోజూ పదివేల మంది ఆకలి తీరుస్తోంది. అందుకోసం సిద్ధం చేసిన చపాతీలనే తమిళ రైతులకు కూడా రోజూ రెండు పూటలా అందించేవారు. కానీ అన్నం తినడాన్నే రైతన్నలు ఇష్టపడతారని తెలుసుకొని వీరికోసం ప్రత్యేకంగా అన్నం వండించి మరీ వడ్డిస్తోంది. వరిసాగు ద్వారా తమిళనాడు మొత్తానికి అన్నం పెట్టిన తంజావురు జిల్లా రైతులకు సైతం.. ఇప్పుడు ఆ గురుద్వారానే పెద్ద దిక్కుగా మారింది. అవసరమైతే రైతన్నలకు వసతి కల్పించేందుకు కూడా ఆ గురుద్వారా ముందుకొస్తోంది. గురుద్వారా వాలంటీర్లే తమను దేవుడిలా ఆదుకుంటున్నారని, తమ ఇంట్లో వాళ్ల ఆకలి చూడలేక రోడ్డెక్కిన తమకు వారే భోజనం పెడుతున్నారంటూ తమిళ రైతులు కృతజ్ఞతా భావాన్ని చాటుతున్నారు.