మూడు రోజుల కిందట తీవ్ర జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందితో హాస్పిటల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంతి సత్యేందర్ జైన్కు కరోనా వైరస్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఈశాన్య ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. అయితే, మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. జ్వరం తగ్గకపోగా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాని తెలిపారు. దీంతో ఆయనను ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు.
న్యూమోనియా తీవ్రత ఎక్కువయినట్టు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆక్సిజన్ స్థాయి 95 ఉండాలి.. కానీ, ఆయనకు 89కి పడిపోయిందని హాస్పిటల్లోని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం సత్యేందర్ జైన్ను సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్కు తరలించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ఆయనకు ప్లాస్మా చికిత్స చేయనున్నారని తెలిపాయి.
సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మంత్రి సత్యేందర్ జైన్కు మంగళవారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. కానీ, మంగళవారం రాత్రి నుంచి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మరోసారి కోవిడ్-19 పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్నా ఆరోగ్యం మెరుగుపడలేదు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో సత్యేందర్ జైన్కు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు గురువారం వెల్లడించారు. అంతలోనే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
కోవిడ్ బారినపడ్డ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు.
కాగా, ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ, తాజా పరిస్థితులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మంత్రి సత్యేందర్ జైన్ కూడా హాజరయ్యారు. అదే రోజు రాత్రి ఆయన అస్వస్థతతో హాస్పిటల్లో చేరగా.. కరోనా నిర్ధారణ అయ్యింది.
న్యూమోనియా తీవ్రత ఎక్కువయినట్టు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆక్సిజన్ స్థాయి 95 ఉండాలి.. కానీ, ఆయనకు 89కి పడిపోయిందని హాస్పిటల్లోని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం సత్యేందర్ జైన్ను సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్కు తరలించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ఆయనకు ప్లాస్మా చికిత్స చేయనున్నారని తెలిపాయి.
సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మంత్రి సత్యేందర్ జైన్కు మంగళవారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. కానీ, మంగళవారం రాత్రి నుంచి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మరోసారి కోవిడ్-19 పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్నా ఆరోగ్యం మెరుగుపడలేదు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో సత్యేందర్ జైన్కు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు గురువారం వెల్లడించారు. అంతలోనే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
కోవిడ్ బారినపడ్డ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు.
కాగా, ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ, తాజా పరిస్థితులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మంత్రి సత్యేందర్ జైన్ కూడా హాజరయ్యారు. అదే రోజు రాత్రి ఆయన అస్వస్థతతో హాస్పిటల్లో చేరగా.. కరోనా నిర్ధారణ అయ్యింది.