యాప్నగరం

ఎలుక పెట్టిన చిచ్చు.. ఒకరి దారుణ హత్య

ఢిల్లీలో దారుణం.. ఎలుక విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ.. రాడ్‌తో దాడి చేయడంతో ఒకరి మృతి..

Samayam Telugu 7 Oct 2018, 1:02 pm
చిన్న, చిన్న కారణాలు హత్యలకు దారి తీస్తున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థంకాని స్థితిలో తోటి మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఎలుక విషయంలో గొడవతో ఓ వ్యక్తిని రాడ్‌తో కొట్టి చంపడం కలకలంరేపింది. నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిరారీ ప్రాంతంలో ఇరుగుపొరుగున ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. చచ్చిన ఎలుకను తీసుకొచ్చి తన ఇంటి ముందు వేశాడని ఓ వ్యక్తి ఆవేశంతో ఊగిపోయాడు. పొరుగింటి వ్యక్తిపైకి గొడవకు వెళ్లాడు.
Samayam Telugu delhi


ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో ఊగిపోయి.. రాడ్ తీసుకొని 40ఏళ్ల వ్యక్తిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అతడు కుప్పకూలిపోగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్సపొందుతూ చనిపోయాడు. బాధితుడి మృతితో ఈ ఘటన బయటపడగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నగరంలోని ఉత్తమ్ నగర్ మోహన్ గార్డెన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమ పెంపుడు కుక్కకు సారీ చెప్పలేదని ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అది మరిచిపోకముందే ఈ ఘటనా వెలుగులోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.