యాప్నగరం

మంచినీళ్లు ఇవ్వలేదని కూతుర్ని చంపేశాడు

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురి పాలిట యముడయ్యాడు. చిన్న కారణంతోనే దారుణంగా కొట్టి చంపేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

TNN 10 Feb 2018, 3:32 pm
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురి పాలిట యముడయ్యాడు. చిన్న కారణంతోనే దారుణంగా కొట్టి చంపేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. తూర్పు ఢిల్లీలోని అశోక్‌నగర్‌కు చెందిన అబ్దుల్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో భోజనం చేస్తున్నాడు. దాహం వేసి మంచినీళ్లు తీసుకురమ్మని కూతురు రుక్షర్‌కు చెప్పాడు. ఇంట్లో మరో పనిలో ఉన్న ఆమె... నీళ్లు తీసుకురాలేదు. ఈలోపే అబ్దుల్‌కు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే చిన్నారిపై తన ప్రతాపాన్ని చూపించాడు. పాపను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. గొంతు నులిమి... ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పడేశాడు.
Samayam Telugu delhi man kills 8 year old daughter over glass of water
మంచినీళ్లు ఇవ్వలేదని కూతుర్ని చంపేశాడు


తీవ్ర గాయాలైన పాపను తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. మూడు రోజుల పాటూ మృత్యువుతో పోరాడిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రుక్షర్‌పై దాడిచేసే సమయంలో తాను ఇంట్లోని మరో గదిలో ఉన్నానని తల్లి చెబుతోంది. రోడ్డుపై విసిరేసే సమయంలో తాను అడ్డుకోబోయానని... అబ్దుల్ తనపైనా దాడి చేశాడని ఆమె ఆరోపించింది. మద్యం అలవాటున్న తన భర్త... రోజూ తమను కొట్టేవాడని పోలీసులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అబ్దుల్‌ను అరెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.