యాప్నగరం

Delhi Farmer: కరోనా వేళ కూలీలను విమానంలో స్వస్థలాలకు పంపిన రైతు ఆత్మహత్య!

Delhi Farmer: బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన బడుగు జీవులు కరోనా టైంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొంతూళ్లకు వెళ్లడానికి చాలా కాలం పాటు నిరీక్షించారు. తన దగ్గర పని చేస్తున్న వారిని విమానంలో స్వస్థలాలకు పంపిన ఓ రైతు దేశం దృష్టిని ఆకర్షించారు. కరోనా తగ్గాక తిరిగి వారికి విమాన టికెట్లు కొనుగోలు చేసి తన దగ్గరకు రప్పించుకున్నారు. అలాంటి మంచి రైతు ఇటీవలే ఆత్మహత్మకు పాల్పడ్డారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 24 Aug 2022, 11:09 am

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న రైతు
  • కరోనా టైంలో విమానంలో కూలీలను స్వస్థలానికి పంపిన గెహ్లట్
  • అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pappan Singh Gahlot
పప్పన్ సింగ్ గెహ్లట్
కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం 2020లో లాక్‌డౌన్ ప్రకటించడంతో.. దేశవ్యా్ప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. స్వరాష్ట్రాలకు వెళ్లడం కోసం వేలాది మంది వలస కార్మికులు.. వేచి చూసిన సందర్భాలున్నాయి. రవాణా సదుపాయం లేకపోవడంతో.. కొందరైతే చంటి పిల్లలతో కాలినడకన సొంతూళ్లకు బయల్దేరి వెళ్లారు. అలాంటి ఇబ్బందిక పరిస్థితుల్లో తన దగ్గర పని చేస్తోన్న కూలీలను పుట్టగొడులు పెంచే పప్పన్ సింగ్ గెహ్లట్ అనే రైతు ఢిల్లీ నుంచి బిహార్‌కు విమానంలో పంపించాడు. దీంతో దేశం మొత్తం ఆయనవైపు ఆసక్తిగా చూసింది. పది మంది కూలీలను ఢిల్లీ నుంచి పాట్నా పంపడం కోసం ఆయన రూ.70 వేలు ఖర్చు చేశారు.
కాగా 55 ఏళ్ల పప్పన్ సింగ్ గెహ్లట్.. బుధవారం ఢిల్లీలోని ఓ గుడిలో సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఢిల్లీలోని అలిపోర్‌లో నివాసం ఉండే పప్పన్ సింగ్.. తన ఇంటి ముందు ఉన్న గుడిలో సీలింగ్‌కు వేలాడుతుండగా తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఆయన దగ్గర్నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనారోగ్యం కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని పప్పన్ ఆ లేఖలో ప్రస్తావించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నారు.

ఎప్పుడూ సరదాగా ఉండే గెహ్లట్... దేశంలో కరోనా ఉధృతి తగ్గాక తన దగ్గర పని చేసి స్వస్థలాలకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించారు. తిరుగు ప్రయాణానికి కూడా ఆయన వారికి విమాన టికెట్లు కొనుగోలు చేశారు.

గెహ్లట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే.. ఆయనది ఆత్మహత్యా కాదా అనేది తేలనుంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.