యాప్నగరం

ఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం

ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలువురు సీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Samayam Telugu 17 Jun 2018, 11:46 am
ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలువురు సీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు కూడా సమావేశానికి హాజయ్యారు. 6 అంశాలే ప్రధాన ఎజెండాగా పాలకమండలి చర్చించనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వీటిపై చర్చిస్తారు. 3.30గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించిన తర్వాత.. సాయంత్రం 4 గంటల వరకు ఈ భేటీ ముగుస్తుంది.
Samayam Telugu నీతి ఆయోగ్


సమావేశంలో ప్రధానంగా.. వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు, ఈ-నామ్, వ్యవసాయ, మార్కెటింగ్ సంస్కరణలపై చర్చించనున్నారు. అలాగే ఆయూష్మాన్ భారత్, పోషాణాభియాన్, మిషన్ ఇంద్రధనుష్‌,జిల్లాల అభివృద్ధితో పాటూ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహరణ కూడా ఎజెండాలో ఉంది. ఇక సమావేశం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. 'జీఎస్టీకి రాష్ట్రాలన్నీ సహకరించి.. వ్యవస్థీకృతం చేశాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జిల్లాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలి. ముద్ర, జన్‌థన్ వంటి రుణాల పథకాలు ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచాయన్నారు.

సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా కీలక ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది. 20 నిమిషాల పాటూ 13 పేజీల నివేదికను చదివి వినిపించారట. జీఎస్టీతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని.. తలసరి ఆదాయం కూడా పెరగడం లేదని వివరణ ఇచ్చారట. రాజధానికి నిధులు ఇవ్వడంతో పాటూ.. రెవెన్యూ లోటు తీర్చాలన్నారట. ఎన్ని కష్టాలు ఉన్నా ఏపీలో రెండంకెల వృద్ధిరేటు సాధించినా.. దేశంలో మాత్రం అది 8కి పరిమితం అయ్యిందన్నారట. అయితే ఈలోపే ఇచ్చిన సమయం ముగిసిందని.. బాబు ప్రసంగానికి హోంమంత్రి రాజ్‌నాథ్ అడ్డుతగిలినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.