యాప్నగరం

ఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో మందు.. మద్యంప్రియులకు గుడ్ న్యూస్

Delhi: హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Samayam Telugu 20 Aug 2020, 11:35 pm
దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లలో లిక్కర్ సరఫరాకు అనుమతించవలసిందిగా ఎక్సైజ్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు లైసెన్స్ లేని రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Samayam Telugu రెస్టారెంట్లలో లిక్కర్‌కు అనుమతి..
Delhi green signals to alcohol sales in restaurents


లాక్‌డౌన్‌తో మూతబడ్డ లిక్కర్ షాపులను తిరిగి తెరిపించడానికి ఢిల్లీలో జూన్ 8 నుంచే అనుమతిచ్చారు. అయితే.. మందు మాత్రం వైన్ షాపుల నుంచి మాత్రమే కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చారు. బార్లు, రెస్టారెంట్లపై ఇప్పటివరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో మద్యం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

రెస్టారెంట్లు మూసేయడంతో ఇన్ని రోజులు నిరాశగా ఉన్న నిర్వాహకులు ఈ వార్తతో చాలా ఊరట పొందారు. అయితే.. బార్లలో మాత్రం మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని ష్పష్టం చేశారు. ఢిల్లీ బాటలో మరిన్ని రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read: ఇంటర్‌ ఫస్ట్‌ క్లాస్‌ వస్తే స్కూటీ.. అమ్మాయిలకు బంపరాఫర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.