యాప్నగరం

ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. రైతుల్లో జోష్, రిపబ్లిక్ డే రోజు సందడే!

Farmers Protest: రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ రోజు వేలాది మందితో ర్యాలీ నిర్వహించడానికి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Samayam Telugu 23 Jan 2021, 9:55 pm
ట్రాక్టర్ల ర్యాలీకి రైతులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. రిపబ్లిక్ డే రోజున నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చినట్లు రైతు సంఘాల ప్రతినిధులు శనివారం (జనవరి 23) సాయంత్రం తెలిపారు. 100 కి.మీ. పరిధిలో ర్యాలీ నిర్వహించడానికి అనుమతి వచ్చినట్లు వెల్లడించారు. జనవరి 26న ఉదయం ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని రైతు నేత అభిమన్యు తెలిపారు.
Samayam Telugu ట్రాక్టర్ ర్యాలీ
Tractor Rally


రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొననున్నారు. ట్రాక్టర్ల ర్యాలీ కోసం మహిళా రైతులు కూడా ఇప్పటికే డ్రైవింగ్ మెళకువలు నేర్చుకున్నారు. శాంతియుతంగా నిర్వహించనున్న ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అయితే.. ఢిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.

Must Read: ట్రాక్టర్ల ర్యాలీ.. అదరగొడుతున్న మహిళా రైతులు, వీడియో

రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య శుక్రవారం జరిగిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సంప్రదింపులకు సంబంధించిన దారులు మూసుకుపోయాయి. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏకాభిప్రాయానికి రావడంలో ఇరుపక్షాలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబట్టగా.. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను మరోసారి పరిశీలించాలని, అంతకంటే ఉత్తమమైన మార్గం లేదని మంత్రులు స్పష్టం చేశారు. జనవరి 26వ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు సమావేశం అనంతరం తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.