యాప్నగరం

Modi Birthday 2022: ప్రధాని పుట్టినరోజు ఆఫర్.. 56 వంటకాలతో థాలీ.. రూ.8.5 లక్షలు గెలుచుకునే ఛాన్స్

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు (Modi Birthday 2022) సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో 56 వంటకాలతో ఓ థాలీని అందించనుంది. ఆ థాలీని ఆరగించిన వారికి అద్భుతమైన బహుమతులు కూడా అందించనుంది. 40 నిమిషాల్లో తింటే రూ.8.5 లక్షలు అందిస్తుంది. అంతేకాదు లక్కి విన్నర్లకు ఉచితం కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Sep 2022, 6:56 pm

ప్రధానాంశాలు:

  • సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు
  • అద్భుతమైన ఆఫర్ పెట్టిన డిల్లీ రెస్టారెంట్
  • ఉచితంగా కేదార్ నాథ్ వెళ్లే అవకాశం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Thali
ప్రధాని నరేంద్ర మోదీ (Modi Birthday 2022) జన్మదినాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలో ఓ రెస్టారెంట్ అద్భుతమైన ఆఫర్ ఒకటి పెట్టింది. అది వింటే.. కచ్చితంగా మిస్ అవ్వాలనుకోరు. ఆ ఆఫర్ అంతా ఆకర్షించే విధంగా ఉంది. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఆ సందర్భగా ఢిల్లీలోని లుటియన్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో పది రోజుల పాటు 56 అంగుళాల థాలీని అందించడంతో పాటు.. రూ.8.5 లక్షలను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. తమ ఆఫర్‌లో భాగంగా అదృష్ట విజేతలకు ఉచితంగా కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కూడా లభిస్తుందని రెస్టారెంట్ యజమాని తెలియజేశారు.
రకరకాల వంటకాలతో...
కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 (ARDOR) రెస్టారెంట్ థాలీలకు ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్ రకరకాల వంటకాలతో రుచికరమైన థాలీలను అందిస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పుట్టిన రోజు సందర్భంగా ఈ రెస్టారెంట్ 56 వంటకాలతో 56 అంగుళాల థాలీని (Thali) అందించనుంది. ఈ విషయాన్ని స్వయంగా రెస్టారెంట్ యజమాని సువీత్ కల్రా వెల్లడించారు. "ప్రధాని నరేంద్ర మోదీకి తాను పెద్ద అభిమానిని. మా రెస్టారెంట్ థాలీలకు ప్రసిద్ధి చెందింది. 56 అంగుళాల థాలీ అనేది 56 వంటకాలతో కలిపి ఒకే థాలీగా ఉంటుంది. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానిని గౌరవించడం కోసమే ఇది చేస్తున్నాం. ఈ థాలీకి 56 అంగుళాల మోదీజి అని పేరు పెట్టాం." కల్రా చెప్పారు.

అదిరే గిఫ్ట్‌లు...
రెస్టారెంట్‌లో ఈ థాలీని ఆరగించేందుకు వచ్చిన వారు ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ థాలీని సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26 వరకు తినేవారిలో లక్కీ డ్రా ద్వారా ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తారు. వారిని ఉచితంగా కేదార్‌నాథ్‌కు ఉచిత యాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. అది మోదీ ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటని కల్రా చెప్పారు.

ధర ఎంతో తెలుసా...
ఈ థాలీలో ఉత్తర భారతదేశానికి చెందిన 56 వంటకాలు ఉంటాయి. ఇక వీటి ధరల విషయానికొస్తే.. మధ్యాహ్నం వెజిటేరియన్ థాలీ రూ.2,600లు, నాన్ వెజ్ థాలీ ధర రూ.2,900. డిన్నర్ థాలీలు ఒక్కో థాలీకి అదనంగా రూ. 300లు వసూలు చేయనున్నారు. ఈ థాలీని ఆరగించే విషయంలో చిన్న పోటీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ పోటీలో జంటలు పాల్గొనవచ్చు. జంటలో ఏ ఒక్కరైనా 40 నిమిషాల్లో థాలీని తింటే.. వారికి రూ.8.5 లక్షలు బహుమతిగా ఇస్తామని రెస్టారెంట్ యజమాని కల్రా చెప్పారు. అలాగే దేశంలో ద్రవ్యోల్భణం గురించి చర్చ జరుగుతుందని, ద్రవ్యోల్బణం పెరిగింది, దానిని తగ్గించాలని ప్రధాని మోదీకి కోరుతున్నామని కల్రా చెప్పారు.

Read More National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.