యాప్నగరం

మోడీ యాంటీ ట్వీట్ల కేసు కొట్టివేత

మోడీ యాంటీ ట్వీట్ల కేసు లో కేజ్రీవాల్ కు ఢిల్లీ స్పెషల్ కోర్టులో ఊరట లభించింది.

TNN 31 May 2016, 7:17 pm
ఢిల్లీ: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన ట్వీట్లపై ఢిల్లీ స్పెషల్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాది వాదిస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని .. హద్దుల్లో ఉంటూనే తాము ప్రభుత్వాన్ని .. ప్రభుత్వాధినేత తీరును విమర్శించామని వాదించారు. ఈ సందర్భంగా ప్రతివాది తరఫున న్యాయవాది తన వాదన్ను వినిపించారు. కేజ్రీవాల్ తన ట్వీట్లతో ప్రధాని మోడీకి పరువుకు భంగం కల్గిందని.. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు జాతికి వ్యతిరేకంగా ఉన్నాయని.. కాబట్టి కేజ్రీవాల్ పై సెక్ష‌న్‌124ఏ, 500 కింద పరువునష్టం, దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలని వాదించారు.
Samayam Telugu delhi special court abrogated the case of anti modi tweets
మోడీ యాంటీ ట్వీట్ల కేసు కొట్టివేత


ఇరు వైపుల నుంచి వాదనలు విన్నకోర్టు ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కేజ్రీవాల్ కు ఊరట లభించినట్లయింది. గత ఏడాది డిసెంబర్ లో కేజ్రీవాల్ కార్యాయంపై సీబీఐ దాడులు నిర్వహించడంతో ట్విట్టర్ ద్వారా మోడీపై కేజ్రీవాల్ విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మోడీ తనను రాజకీయంగా ఎదుర్కొన లేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తుతూ మోడీ పిరికివాడు, మానసిన రుగ్మత ఉన్నవాడుగా పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ ట్వీట్ లు చేశారు.. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.