కరోనా కేసులు గతవారం నుంచి పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో మాస్క్ తప్పనిసరి నిబంధనలు మళ్ల అమల్లోకి రానున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి రూ.500 జరిమానా విధించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. రాజధాని, పరిసర ప్రాంతాల్లో కేసులు పెరుగుదలపై డీడీఎంఏ సమావేశంలో సమీక్షించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడటంతో పాఠశాలలను మూసివేయనున్నారనే ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే ఉంటాయని, వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన మార్గదర్శకాలను నిపుణులతో చర్చించిన తర్వాత జారీ చేయనున్నారు. ఢిల్లీలో కరోనా కేసులు ఏప్రిల్ రెండో వారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారంతో పోల్చితే అక్కడ బుధవారం 26 శాతం కంటే ఎక్కువ కేసులు బయటపడ్డాయి.
గడచిన 24 గంటల్లో మొత్తం 632 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గత 15 రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంత వాసుల్లో కొవిడ్ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ‘లోకల్ సర్కిల్’ సర్వేలో తేలింది. దీంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం లేదని.. వైరస్తో సహజీవనం తప్పదన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల కట్టడికి నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా మంగళవారం 4.21 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఢిల్లీ(632), కేరళ (488) ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది.
గడచిన 24 గంటల్లో మొత్తం 632 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గత 15 రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంత వాసుల్లో కొవిడ్ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ‘లోకల్ సర్కిల్’ సర్వేలో తేలింది. దీంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం లేదని.. వైరస్తో సహజీవనం తప్పదన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల కట్టడికి నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా మంగళవారం 4.21 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఢిల్లీ(632), కేరళ (488) ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది.