యాప్నగరం

23 మంది రేప్ చేశారు.. పోలీసులకు మహిళ ఫిర్యాదు

తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారని న్యూ ఢిల్లీకి చెందిన ఓ మహిళ(28) రాజస్థాన్‌లోని బికనేర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

TNN 29 Sep 2017, 12:51 pm
తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారని న్యూ ఢిల్లీకి చెందిన ఓ మహిళ(28) రాజస్థాన్‌లోని బికనేర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో ఇద్దరి తాను గుర్తుపడతానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బికనేర్ ఎస్పీ సవాయి సింగ్ గోడరను కలిసిన ఆ మహిళ.. మంగళవారం మధ్యాహ్నం బికనేర్ శివారులో రహదారి పక్కన నిలుచున్న తనను అపహరించి 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
Samayam Telugu delhi woman claims 23 men raped her in bikaner
23 మంది రేప్ చేశారు.. పోలీసులకు మహిళ ఫిర్యాదు


మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌లోని రిడ్‌మల్సర్‌ పురోహిటన్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం జైపూర్ రోడ్డులో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్‌యూవీలో వచ్చి లిఫ్ట్ ఇస్తాం రమ్మని అడిగారు. బలవంతంగా కారులోకి లాగేసి.. అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ పలుమార్లు అత్యాచారం జరిపారు. ఆ తరవాత వీరిద్దరూ తమ స్నేహితులను పిలిచారు. వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.

అనంతరం అక్కడి నుంచి పలన అనే గ్రామంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారనీ, అక్కడ పలువురు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీంతో బికనేర్‌లోని జై నారాయణ్ వ్యాస్ కాలనీ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. వారిని సుభాష్, రాజు రామ్, భన్వర్‌లాల్, మనోజ్ కుమార్, జుగల్, మదన్‌గా గుర్తించామని వెల్లడించారు. అందరూ 20 ఏళ్లు పైబడిన యువకులేనని తెలిపారు. ఇతర నిందితుల వివరాల కోసం ఈ ఆరుగురిని విచారిస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.