యాప్నగరం

మేం సమ్మెలో లేం.. అవన్నీ అబద్ధాలు: ఢిల్లీ ఐఏఎస్‌లు

ఢిల్లీలో కేజ్రీవాల్ ధర్నా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఐఏఎస్‌లు సమ్మెలో ఉన్నారంటూ సీఎం లెఫ్టినెంగ్ గవర్నర్ నివాసంలో ఉంటే.. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.

Samayam Telugu 17 Jun 2018, 6:28 pm
ఢిల్లీలో కేజ్రీవాల్ ధర్నా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఐఏఎస్‌లు సమ్మెలో ఉన్నారంటూ సీఎం లెఫ్టినెంగ్ గవర్నర్ నివాసంలో ఉంటే.. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏఐఎస్‌ల సంఘం ఈ వ్యహారంపై స్పందించింది. 'మేము ఎలాంటి సమ్మె చేయడం లేదు.. కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు. మేం విధులతో పాటూ అన్ని సమావేశాలకు హాజరవుతున్నాం. అన్నిశాఖల్లో పనులు యధావిథిగా జరుగుతున్నాయి. పరిస్థితిని బట్టి సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నాం' అంటున్నారు అధికారులు.
Samayam Telugu IAS


'మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం.. చట్టం, రాజ్యాంగంలోని నిబంధనల అనుగుణంగానే విధులు నిర్వర్తిస్తున్నాం. కానీ అనవసరంగా మాపై నిందలు వేస్తున్నారు. ఇలా ప్రెస్‌ మీట్‌ పెట్టే పరిస్థితి వస్తుందని వస్తుందని ఊహించలేదు. రాజకీయాల కోసం మమ్మల్ని పావులుగా వాడుకోవద్దు అన్నారు' ఐఏఎస్‌లు. గత వారం రోజులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నివాసంలో ధర్నా చేస్తున్నారు. ఐఏఎస్‌లంతా సమ్మెలో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పందించాల్సి వచ్చింది.

Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.