యాప్నగరం

మంత్రులు, ఎమ్మెల్యేల కోసం కరోనా డీలక్స్ గదులు

Bengaluru: కరోనా బారిన పడుతున్న సాధారణ ప్రజలకు ఓ వైపు ఆస్పత్రుల్లో బెడ్లు, కనీస సదుపాయాలు లభించక ఇబ్బందలు పడుతుంటే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Samayam Telugu 25 Jun 2020, 4:45 pm
వైపు కరోనా బాధితులు ఆస్పత్రుల్లో బెడ్లు, కనీస సదుపాయాలు దొరక్క అవస్థలు పడుతుంటే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం యెడియూరప్ప ప్రభుత్వం సకల సదుపాయాలతో కొవిడ్-19 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో కుమార కృప గెస్ట్ హౌస్‌లో 100 డీలక్స్‌ గదులను ఇందు కోసం కేటాయించారు.
Samayam Telugu బెంగళూరులో డీలక్స్ గదులు
Corona Delux Rooms In Bengaluru


కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం ఈ గదులను కేటాయిస్తున్నట్లు బుధవారం (జూన్ 24) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ వైపు కరోనా బారినపడుతున్న సాధారణ ప్రజలు ఆస్పత్రుల్లో చోటు, వసతులు లేక అల్లాడుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్‌ గదులు కావాల్సి వచ్చాయా అని ప్రశ్నిస్తున్నాయి. అయితే.. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య పది వేల మార్కును దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 164 మంది మరణించారు.

Also Read: పాక్ రాజధానిలో హిందూ దేవాలయం

Must Read: దగ్గు మందు పేరు చెప్పి కరోనా మాత్రలు తెచ్చారట!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.