యాప్నగరం

డిజిటల్ లావాదేవీలపై ప్రచారానికి రూ.94 కోట్లు!

నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రకటనల కోసం రూ.94 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

TNN 3 Feb 2017, 12:12 pm
నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రకటనల కోసం రూ.94 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో గురువారం విపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సొమ్మును ఆయా పత్రికలు, సంస్థలకు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లిస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu demonetisation nearly rs 94 crore spent post note ban to popularize digital payments
డిజిటల్ లావాదేవీలపై ప్రచారానికి రూ.94 కోట్లు!


కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఆడియో విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) నవంబరు 9 నుంచి జనవరి 25 వరకు రూ.14.95 కోట్ల వివిధ ప్రసార మాధ్యమాలకు చెల్లించిందని రాథోడ్ అన్నారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా ఆయా సంస్థల ఖాతాలకు మళ్లించినట్లు పేర్కొన్నారు. ప్రకటనలు ఇచ్చిన తర్వాత బిల్లుల కోసం 60 రోజుల్లోగా సంబంధిత సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దేశంలో నల్లధనాన్ని నివారించి, అవినీతిని అంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ చలామణిలో ఉన్న రూ.1,000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు గత నవంబరు 8 ప్రకటించారు. దీని ద్వారా దేశంలోకి చొరబడుతున్న తీవ్రవాదుల్ని కూడా అడ్డుకునేందుకు సహకరిస్తుందని మోడీ అప్పట్లో ప్రకటించారు. నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రధాని నిర్ణయాన్ని మెజార్టీ జనం సమర్దించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.