నోట్ల రద్దు అంశంలోకి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని దేశ సైన్యాన్ని లాగడం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి తగదని బీజేపీ హితవుపలికింది. ఈ తరహా దిగజారుడు రాజకీయాలొద్దు అని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మమతకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ తక్షణమే సైన్యానికి క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదగాలని మమత ప్రయత్నిస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ తన ఎదుగుదల కోసం సైన్యాన్ని వాడుకోవాలని చూడటమే సహించరాని నేరమన్నారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వర్గానికి మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నాననే అక్కసుతోనే కేంద్రం తమ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించిందని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సైన్యం ఇచ్చిన వివరణ మమతను ఇరుకున పడేయడంతో పాటు దేశ వ్యాప్తంగా ఆమె తీరుపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
మమతక్కా.. దిగజారుడు రాజకీయాలొద్దు: బీజేపీ
నోట్ల రద్దు అంశంలోకి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని దేశ సైన్యాన్ని లాగడం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి తగదని బీజేపీ హితవుపలికింది.
TNN 3 Dec 2016, 9:19 am