యాప్నగరం

నోట్ల కష్టాలు.. మరో ఏడాది పాటు!

దేశంలో కరెన్సీ కష్టాలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయా?!

TNN 14 Dec 2016, 10:05 am
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు దాటిపోయింది. కరెన్సీ కొరత కష్టాలు తీరడానికి కేవలం 50 రోజులు మాత్రమే పడుతుందని, ఈలోగా ప్రజలు సర్దుకుని ప్రభుత్వానికి సహకరించాలని.. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి పదేపదే కోరుతున్నారు. కానీ, వాస్తవానికి దేశంలో కరెన్సీ కష్టాలు ముగియడానికి 50 రోజులు కాదని అంతకన్నా ఎక్కువే పడుతుందని ఆర్ధిక నిపుణులు స్ఫష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu demonetization cash crunch situation may be extended to one more year
నోట్ల కష్టాలు.. మరో ఏడాది పాటు!


దీనిపై ఆయా రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా నోట్ల రద్దు తదనంతర పరిస్థితులపై స్పందించారు. దేశంలో అవినీతి, నల్లధనం రూపుమాసిపోవాలని తమ పార్టీ కూడా కోరుకుంటోందని ఈ సందర్భంగా ఆయన చెపుతూనే.. కానీ, దానికి మోడి ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కరెన్సీ కష్టాలు తీరడానికి మోడి చెప్పినట్లు 50 రోజులు సరిపోవని, కనీసం సంవత్సరం అయినా పడుతుందని చెప్పారు. ఈ చలికాలంలో గజగజ వణుకుతూ ప్రజలు ఏటీఎంల ఎదుట బారులు తీరడం తనను కలచివేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరినట్లుగానే క్యూలలో నిలబడతారని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.