యాప్నగరం

మరో 5 నెలలు నగదు కొరత కంటిన్యూ

యాభై రోజుల్లో నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక కొరత తీరిపోతుందని ప్రధాని మోడీ ప్రకటించారు.

TNN 25 Nov 2016, 2:30 pm
యాభై రోజుల్లో నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక కొరత తీరిపోతుందని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నగదు కొరత ఇప్పట్లో తీరదని కనీసం నాలుగు నుంచి అయిదు నెలలు పడుతుందని అంటున్నాయి బ్యాంకుల ఉద్యోగుల సంఘం. ద బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంఘం వారు మీడియాకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్‌లో ప్రస్తుతం దేశంలో నాలుగు కరెన్సీ ముద్రణ శాలలు ఉన్నాయని, ఆ నాలుగింటిలోనూ పూర్తిగా సమయం ప్రింటింగ్ చేసినప్పటికీ కరెన్సీ కొరత కొన్ని రోజుల్లో తీరదని పేర్కొన్నారు. యథావిథి స్థితికి చేరడానికి అయిదునెలల దాకా పడుతుందని అన్నారు. అప్పటి దాకా ఇలాంటి సమస్యలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.
Samayam Telugu demonetization cash shortage to continue for 4 to 5 months says bank employees federation
మరో 5 నెలలు నగదు కొరత కంటిన్యూ


వచ్చే నెల జీతాల చెల్లింపుల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, ఏటీఎంల నుంచి అవసరమైనంత మొత్తం ఉద్యోగులు తీసుకోలేక తీవ్ర అసహనానికి గురవుతారని అన్నారు. దీని వల్ల ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని వారన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజుకో ప్రకటన చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.