యాప్నగరం

ఈ కష్టాలు పావు వంతు మాత్రమే: అరుణ్ జైట్లీ

నోట్లరద్దు వల్ల ఏర్పడిన అంతరాయం, ప్రజల ఇబ్బందులు కేవలం పావు వంతు మాత్రమేనని, కానీ దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని

TNN 2 Dec 2016, 12:47 pm
నోట్లరద్దు వల్ల ఏర్పడిన అంతరాయం, ప్రజల ఇబ్బందులు కేవలం పావు వంతు మాత్రమేనని, కానీ దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రద్దయిన పెద్దనోట్లకు సరిసమానంగా ప్రస్తుతం కొత్తనోట్ల ముద్రణ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu demonetization disruption is a quarter says arun jaitly
ఈ కష్టాలు పావు వంతు మాత్రమే: అరుణ్ జైట్లీ


‘దీని వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందని నేను అనుకోవడం లేదు. ఇది కేవలం పావు వంతు మాత్రమే’ అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

దేశంలో గడిచిన ఏడు దశాబ్దాలుగా నల్లధనం పేరుకుపోయిందని, పెద్దనోట్ల రద్దుతో అవినీతి లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డిసెంబర్ 30 తర్వాత పెద్దనోట్ల రద్దు ఫలితాలు ప్రతిఒక్కరూ చూస్తారని ఆయన అన్నారు. పన్ను చెల్లింపు దారులు, సామాన్య ప్రజలకు తాము మధ్యవర్తులుగా ఉన్నామని చెప్పిన అరుణ్ జైట్లీ....పన్ను ఎగవేతదారులు వదిలిపెట్టేది లేదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.