యాప్నగరం

పరిమితికి మించిన డిపాజిట్లపై పన్ను పోటు !

నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ కోసం జనం బ్యాంకుల ముందు భారీ క్యూలైన్లలో పాట్లు పడుతున్న ప్రస్తుత పరిణామాలని కేంద్ర కేబినెట్...

TNN 25 Nov 2016, 6:01 am
రూ.500, రూ.1,000 పాత నోట్లని రద్దు చేసిన అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ కోసం జనం బ్యాంకుల ముందు భారీ క్యూలైన్లలో పాట్లు పడుతున్న ప్రస్తుత పరిణామాలని కేంద్ర కేబినెట్ పరిగణనలోకి తీసుకుని ఇంకా ఏమైనా కొత్త మినహాయింపులు ఇస్తుందా అనే కోణంలో యావత్ దేశం ఈ భేటీపై ఆసక్తి కనబర్చింది.
Samayam Telugu demonetization effect points discussed in the central cabinet meeting on currency ban
పరిమితికి మించిన డిపాజిట్లపై పన్ను పోటు !


అయితే కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం అందిన సమాచారం ప్రకారం ఊహించినట్టుగానే ఈ భేటీలో నోట్ల రద్దు అంశం, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపైనే అధికంగా చర్చించినట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత అయిన బ్యాంకు డిపాజిట్లపై 60% పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. బ్యాంకులు ఆర్బీఐకి అందించిన ఓ నివేదక ప్రకారం నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వున్న బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ సౌకర్యం కలిగిన జన్ ధన్ ఎకౌంట్లలో దాదాపు రూ.21,000 కోట్లు డిపాజిట్ అవడంపై కేబినెట్ ఫోకస్ చేసింది.

కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకున్నారనే వివరాల్ని అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవానికి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న సమయంలో జరిగే భేటీలకు సంబంధించిన అంశాలని బయటకు వెల్లడించకపోవడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీనే అని చెప్పుకోవాలి. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వంపై వచ్చిన విమర్శల్ని తిప్పికొట్టే విధంగా బ్యాంకుల్లో డిపాజిట్ అయిన బ్లాక్ మనీపై పన్ను రూపంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయపన్ను విభాగం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఒక్కో ఎకౌంట్‌లో రూ.2.5 లక్షలకు మించి డిపాజిట్ అయిన మొత్తానికి లెక్కలు చెప్పాల్సిందిగా కోరుతున్న ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్... లెక్క తేలని మొత్తాన్ని అదనపు ఆదాయంగా భావిస్తూ, ఆ మొత్తంపై భారీగా పన్ను విధించాలని ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాకుండా ఇదే పార్లమెంట్ సమావేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్టుకి సవరణలు చేయాలని సైతం కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.