యాప్నగరం

పాత కరెన్సీతో రీఛార్జ్ చేయించుకుంటున్నారా?

పాతనోట్లతో మొబైల్ రీ ఛార్జ్ చేయించుకుంటే నెంబర్ కూడా ఇవ్వాలి.

TNN 26 Nov 2016, 4:35 pm
పాత రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోమని, డిపాజిట్ చేసుకోవడానికి నవంబర్ 24తో గడువు ముగిసిపోయింది. మరి చేతిలో ఉన్న పెద్ద నోట్లను ఏం చేయాలి అని బాధపడే సామాన్య ప్రజలకి వాటిని వాడేందుకు మరికొన్ని అవకాశాలు కల్పించారు. అలా ఇచ్చిన అవకాశాలలో ప్రీ పెయిడ్ మొబైల్ రీఛార్జ్ కూడా ఒకటి. పాత అయిదువందల నోటు ఇచ్చి మొబైల్ కి ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఈ అవకాశం కూడా డిసెంబర్ 15 వరకే. అయితే తాజాగా కేంద్రం మరో నిబంధన కూడా విధించింది. ఇది ప్రజలకు కాదు టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు.
Samayam Telugu demonetization mobile recharge with old currency
పాత కరెన్సీతో రీఛార్జ్ చేయించుకుంటున్నారా?


ఎవరైతే పాత అయిదువందల నోటుతో ప్రీపెయిడ్ టాపప్స్ కొంటారో... ఆ వినియోగదారుడి ఫోన్ నెంబర్ ను, పేరును కూడా ప్రభుత్వానికి పంపించాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. మన దేశంలో పోస్ట్ పెయిడ్ మొబైల్ సర్వీసులు వాడే చాలా తక్కువ. 90 శాతం మంది ప్రీ పెయిడ్ సర్వీసులే వాడతారు. కనుక భారీ మొత్తంలోనే పాత అయిదువందల నోట్లు వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.