యాప్నగరం

బ్యాంకులలో ఇక నోట్ల మార్పిడి జరుగదు

నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.

TNN 24 Nov 2016, 8:49 pm
నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. రద్దయిన నోట్లను బ్యాంకులలో మార్పిడి చేసుకోవడానికి గడువు గురువారం అర్థరాత్రితో ముగిసిపోతుంది. ఈ గడువును పెంచే యోచన లేదని నేటితో నోట్ల మార్పిడి ముగిసిపోయినట్టేనని కేంద్రం ప్రకటించింది. బ్యాంకుల దగ్గర క్యూలైన్లు తగ్గుముఖం పట్టాయని అందుకే పెంచాల్సిన అవసరం కనిపించలేదని ప్రభుత్వం అభిప్రాయపడింది.
Samayam Telugu demonetization no more exchange of rs 500 and rs 1000 notes centre announces
బ్యాంకులలో ఇక నోట్ల మార్పిడి జరుగదు


అలాగే రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, మునిసిపల్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లలో ఫీజులు కట్టేందుకు పాత రూ.500 నోట్లతో చెల్లించవచ్చు. అయితే కేవలం రూ.2000 దాటని ఫీజులకే ఇది వర్తిస్తుంది.

టోల్ ప్లాజాల దగ్గర డిసెంబర్ 3 వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకు రూ.500 నోట్లతో టోల్ ట్యాక్స్ కట్టొచ్చు.

విదేశీయులు వారానికి రూ.5000 వరకు విదేశీ కరెన్సీని మార్చుకునే అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను వాళ్ల పాస్ పోర్టులలో నమోదు చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.