యాప్నగరం

ఉభయసభలు గంటపాటు వాయిదా

పార్లమెంటు సమావేశాలు గురువారం కూడా గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 24 Nov 2016, 11:27 am
పార్లమెంటు సమావేశాలు గురువారం కూడా గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలలో పెద్ద నోట్ల రద్దుపై చర్చకు పట్టబట్టాయి. ప్రారంభమైన పది నిమిషాలకే గంటపాటు వాయిదా పడ్డాయి.
Samayam Telugu demonetization note ban hit parliament
ఉభయసభలు గంటపాటు వాయిదా


ఉభయసభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

నోట్లరద్దు అంశంపై రాజ్యసభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా..ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.

సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కోరారు.

అటు లోక్ సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో లోక్ సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభలను గంటపాటు వాయిదా వేశారు.

బుధవారం ప్రధాని మోదీ లోక్‌సభకు హాజరైనప్పటికీ ఆయనేం మాట్లాడలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.