యాప్నగరం

ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి: విపక్షాలు

పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

Samayam Telugu 2 Dec 2016, 11:37 am
పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతి పరులకు ప్రతిపక్షాలు బాసటగా నిలుస్తున్నాయని అన్నారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
Samayam Telugu demonetization opposition demands pms apology
ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి: విపక్షాలు


ప్రధానమంత్రి క్షమాపణ చెబితే తాము చర్చకు సిద్ధమని ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేశారు.

అయితే గడిచిన 16రోజులుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడం లేదని, వాయిదాలతోనే కాలం గడిచిపోతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అన్నారు. సభను సజావుగా సాగనిస్తే ఏ అంశమైన చర్చిద్దామని ఆయన విపక్షాలను కోరారు.

శుక్రవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు విపక్షాల సభ్యులు సమావేశమై ఇవాళ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.