యాప్నగరం

సభలో అదే అల్లరి, గంట వాయిదా!

​ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ప్రారంభమైన కాసేపటికే పార్లమెంటు ఉభయ సభలు గంటపాటు వాయిదా పడ్డాయి.

Samayam Telugu 15 Dec 2016, 11:36 am
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ప్రారంభమైన కాసేపటికే పార్లమెంటు ఉభయ సభలు గంటపాటు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సహా మరో 14 రాజకీయ పార్టీలు కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని నిర్ణయించాయి.
Samayam Telugu demonetization opposition hit parliament chaos contiues
సభలో అదే అల్లరి, గంట వాయిదా!


గురువారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. ప్రజా, రైతు వ్యతిరేక ప్రభుత్వం..మోదీ ప్రభుత్వం..డౌన్ డౌన్ అనే నినాదాలతో ప్రతిపక్ష నేతలు పార్లమెంటు ఆవరణను హోరెత్తించారు.

ఉభయసభలు ప్రారంభం కాగానే...నోట్లరద్దుపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. నోట్లరద్దు వల్ల సామాన్యులు, కార్మికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ విమర్శించారు.

ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఎంతకు ఆపకపోవడంతో...ఉభయసభలు గంటపాటు వాయిదా పడ్డాయి.

గురువారం సమావేశాలకు ముందు ప్రధాని మోదీ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మరోరెండురోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో..నోట్లరద్దుపై సభలో ఏలాంటి ప్రకటన చేయాలన్న అంశంపై మోదీ మంత్రులతో సమాలోచనలు జరిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.