యాప్నగరం

ఆ అంశంపై ప్రభుత్వంతో విపక్షాల నో చర్చలు

పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపేందుకు చేస్తున్న కేంద్ర మంత్రుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Samayam Telugu 24 Nov 2016, 11:47 am
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపేందుకు చేస్తున్న కేంద్ర మంత్రుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Samayam Telugu demonetization opposition will not meet government
ఆ అంశంపై ప్రభుత్వంతో విపక్షాల నో చర్చలు


ఉభయసభల విపక్ష సభ్యులతో చర్చించేందుకు కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే నవంబర్ 28 వరకు నోట్ల రద్దుపై తాము ప్రభుత్వంతో ఏలాంటి చర్చలు జరపబోమని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు.
నోట్ల రద్దుపై సోమవారం (నవంబర్ 28) నాడు ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నాయి. ఆ ఆందోళన పూర్తయ్యేంతవరకు ప్రభుత్వంతో ఏలాంటి చర్చలు జరపకూడదని ప్రతిపక్ష సభ్యులు నిర్ణయించారు.

ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
‘ఇది అధికారిక సమావేశం. మాకు అన్ని పార్టీలను సమానంగా చూస్తాం. వారిచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తాం’ అని అనంత్ కుమార్ అన్నారు.

ఇతర పార్టీల నేతలతో సమావేశం నిర్వహించేకంటే ముందు కేంద్రమంత్రులు సమావేశమై పార్లమెంటు సమావేశాల నిర్వహణపై చర్చించారు.

నోట్ల రద్దు అంశాన్ని చర్చకు అనుమతించాలని, ప్రధానమంత్రి మోదీ సభకు హాజరుకావాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.