యాప్నగరం

‘క్యాష్‌లెస్’పై ప్రధాని కార్యాలయంలో వర్క్‌షాప్

దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచాలని పీఎం నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రేరణ పొందిన ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు శుక్రవారం తమ బాధ్యతను నిర్వర్తించారు.

TNN 28 Nov 2016, 4:19 pm
దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచాలని పీఎం నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు సోమవారం తమ బాధ్యతను నిర్వర్తించారు. కార్యాలయంలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, అదనపు ప్రధాన కార్యదర్శి పి.కె. మిశ్రాతో పాటు ఇతర అధికారులు ప్రధాన మంత్రి కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు.
Samayam Telugu demonetization pmo officials take initiative to train staff for mobile banking and cashless transactions
‘క్యాష్‌లెస్’పై ప్రధాని కార్యాలయంలో వర్క్‌షాప్


మొబైల్ బ్యాంకింగ్‌ సర్వీసును ఎలా ఉపయోగించాలి, యూపీఐ, ఈ-వాలెట్ల వంటి మొబైల్ అప్లికేషన్ల ద్వారా నిత్యం లావాదేవీలు ఎలా జరపాలి అనే విషయాలపై పీఎంవోలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులందిరికీ అవగాహన కల్పించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI), మైగవర్నమెంట్ (MyGov) ఉన్నతాధికారులు కూడా ఈ వర్క్‌షాప్‌లో పాలుపంచుకున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.