యాప్నగరం

నగదు విత్ డ్రా పరిమితిని పెంచిన ఆర్‌బీఐ, కానీ..

ఇప్పటి వరకూ బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేలు మాత్రమే తీసుకునే వీలుండగా, ఆర్‌బీఐ తాజాగా ఆ పరిమితిని పెంచింది. కానీ ఓ నిబంధన విధించింది.

TNN 29 Nov 2016, 9:27 am
బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధలను కొద్ది మేర సడలించింది. ఇప్పటి వరకూ వారంలో గరిష్టంగా రూ.24 వేల వరకు మాత్రమే బ్యాంకు ఖాతాల నుంచి తీసుకునే వీలుండగా, ఆర్‌బీఐ ఈ విషయంలో సడలింపునిచ్చింది. ప్రజలు తమ వద్దనున్న రూ.2000, రూ.500 కొత్త నోట్లను బ్యాంకులో జమ చేసి అందుకు సమానమైన మొత్తాన్ని ఆ వారంలో విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఉదాహరణకు మీరు నాలుగు వేల రూపాయల విలువైన కొత్త నోట్లను కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తే.. వారంలో మీరు విత్ డ్రా చేసుకునే రూ. 24 వేలకు అదనంగా మరో నాలుగు వేలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.
Samayam Telugu demonetization rbi raises withdrawal limit
నగదు విత్ డ్రా పరిమితిని పెంచిన ఆర్‌బీఐ, కానీ..


డిపాజిట్ చేసిన కొత్త నోట్ల స్థానంలో రూ.500, రూ.2000 నోట్లను ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అవసరానికి పనికొస్తాయనే ఉద్దేశంతో ప్రజలు కరెన్సీని తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీంతో మార్కెట్లో నోట్ల సర్క్యులేషన్ తగ్గింది. ఈ పరిస్థితిని చక్కదిద్దే దిశగా చర్యలు ఆరంభించిన రిజర్వ్ బ్యాంక్ డిపాజిట్ ఆధారంగా విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.