యాప్నగరం

చిల్లర లేకపోయినా ‘టోలు’ వలిచేస్తున్నారు!

శుక్రవారం అర్థరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద వాహనాలకు రవాణా సుంకం వసూలు చేస్తున్నారు.

Samayam Telugu 3 Dec 2016, 3:10 pm
శుక్రవారం అర్థరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద వాహనాలకు రవాణా సుంకం వసూలు చేస్తున్నారు. నోట్లరద్దు అనంతరం చిల్లర దొరకడం లేదన్న కారణంతో మూడువారాల పాటు కేంద్రప్రభుత్వం టోల్ పై మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu demonetization toll plazas get back long queues
చిల్లర లేకపోయినా ‘టోలు’ వలిచేస్తున్నారు!

శనివారం ఉదయం నుంచి అన్ని టోలుగేట్ల వద్ద స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంటాయని...నగదు చేతిలో లేకపోయినా...డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టోల్ చెల్లించవచ్చని కేంద్రం చెప్పినా...చాలాచోట్ల స్వైపింగ్ మిషన్లు అందుబాటులో లేవు. ఇంకొన్నిచోట్ల చిల్లర లేకపోవడంతో....కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లు టోల్ రుసుం చెల్లించేందుకు రూ.2వేల నోట్లు ఇస్తుండటంతో...టోల్ ప్లాజా సిబ్బంది చిల్లర ఇవ్వలేకపోతున్నారు. దీంతో వాహనదారులు టోల్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.

దేశవ్యాప్తంగా 393 టోల్ ప్లాజాలు ఉన్నాయని...పలుచోట్ల చిల్లర అందుబాటులో లేకపోవడంతో వాహనాలు బారులు తీరాయని ఎన్‌హెచ్ఏ అధికారులు తెలిపారు. ఈ టోల్ గేట్ల నుంచి రోజుకు రూ.51.59కోట్ల ఆదాయం సమకూరేది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.