యాప్నగరం

ఒకే పార్టీ రెండు నాల్కలు: జేడీయూలో చీలిక?

నోట్లరద్దు వ్యవహారం జేడీయూ పార్టీ మధ్య చిచ్చు పెట్టినట్లుగానే కనిపిస్తోంది.

Samayam Telugu 4 Dec 2016, 9:49 am
నోట్లరద్దు వ్యవహారం జేడీయూ పార్టీ మధ్య చిచ్చు పెట్టినట్లుగానే కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోట్లరద్దును సమర్థిస్తూ, కేంద్రానికి మద్దతుగా మాట్లాడుతుండగా...అదే పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ మాత్రం...నోట్లరద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Samayam Telugu demonetization while nitish supports note ban sharad yadav opposes
ఒకే పార్టీ రెండు నాల్కలు: జేడీయూలో చీలిక?


నోట్లరద్దు వల్ల అవినీతి అంతమొందుతుందని, ఇతర రూపాల్లో ఉన్న బ్లాక్ మనీనీ కూడా వెలికి తీయాలని, బీనామీల పనిపట్టాలని నితీష్ కుమార్ కేంద్రానికి సూచించారు. శనివారం బిహార్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో నితీష్, శరద్ యాదవ్ లిద్దరూ పాల్గొన్నారు. ఒకే వేదికపై నితీష్ నోట్లరద్దును స్వాగతిస్తే...శరద్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

శరద్ యాదవ్ మిగతా ప్రతిపక్షాలతో కలిసి నోట్లరద్దుపై రాజ్యసభలో కూడా ఆందోళన చేపట్టారు. నోట్లరద్దు కేవలం బ్యాంకులు, బ్లాక్ మనీ సంపాదించే వారికోసమేనని ఆయన విమర్శిస్తున్నారు. దీనివల్ల దేశం మొత్తం క్యూలో నిలబడి అనేక కష్టాలు అనుభవిస్తుందని మండిపడ్డారు.

అటు నితీష్ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లు కూడా నోట్లరద్దును తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.