యాప్నగరం

డీఈఏ మాజీ ఛైర్మన్, ఐఎన్ఎస్ అరిహంత్ సృష్టికర్త శేఖర్ బసు కన్నుమూత

భారత అణుశక్తి విభాగంలో నాలుగు దశాబ్దాలుపాటు పనిచేసి, దేశ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త శేఖర్ బసు అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.

Samayam Telugu 24 Sep 2020, 12:01 pm
అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ శేఖర్ బసు (68) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. దేశంలో అణుశక్తి అభివృద్ధి శేఖర్ బసు ఎంతగానో కృషిచేశారు. దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఏఎస్ అరిహంత్ రూపకల్పనలో శేఖర్ బసు ప్రముఖ పాత్ర పోషించారు. భారత అణుశక్తి కార్యక్రమంలో నాలుగు దశాబ్దాలపాటు సేవలు అందించారు.
Samayam Telugu శేఖర్ బసు


శుద్దిచేసిన యురేనియం ఉపయోగించి 100 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన అణు రియాక్టర్ ద్వారా ఐఎన్ఎస్ అరిహంత్ జలాంతర్గామి పనిచేసేలా రూపొందించడంలో శేఖర్ బసు పాత్రే కీలకం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రెటరీగానూ, బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ అణ్వాయుధ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.

ఇక, 2015లో భారత అణుశక్తి ప్రోగ్రామ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ పదవిలో 2018 అక్టోబరు వరకు కొనసాగారు. 1952 సెప్టెంబరు 20 బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జన్మించిన శేఖర్ బసు.. ముంబయి యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.