యాప్నగరం

మోదీజీ.. ఆ టైంలో బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా?: అసద్

పుల్వామా దాడి జరిగిన టైంలో బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా? అని ప్రధాని మోదీని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

Samayam Telugu 24 Mar 2019, 6:53 pm
ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీపై మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన సమయంలో బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా? అని మోదీని అసద్ ప్రశ్నించారు. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని అమిత్ షా చెప్పారు. రాజ్‌నాథ్ సింగేమో అక్కడ 300 సెల్ ఫోన్స్ ఉన్నట్టు ఎన్టీఆర్వో గుర్తించిందన్నారు. బాలాకోట్‌లో 300 సెల్‌ఫోన్లు ఉన్నట్టు చూడగలిగిన మీరు.. పుల్వామాలో 50 కిలోల ఆర్డీఎక్స్ తరలిస్తుంటే చూడలేకపోయారా? అని అసద్ ప్రశ్నించారు.
Samayam Telugu Modi-Owaisi


ఆ సమయంలో రాజ్‌నాథ్, మోదీ బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారేమో తెలుసుకోవాలని అనుకుంటున్నా అని అసద్ తెలిపారు. దేశంలో సెక్యూలరిజాన్ని అంతం చేయడానికి ప్రయత్నించే వారికి వ్యతిరేకంగానే నా పోరాటమని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎలాంటి తేడా లేదని అసద్ విమర్శించారు. శనివారం

అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి మరోసారి లోక్ సభ బరిలో నిలుస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేసిన అసద్.. జంట నగరాల నుంచి కాబోయే పార్లమెంటేరియన్లం అని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.