యాప్నగరం

హత్రాస్ కేసు విచారణ అధికారి భార్య ఆత్మహత్య

అధికారి భార్య వయసు 36 ఏళ్లు. ఆయన కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె బెడ్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.

Samayam Telugu 24 Oct 2020, 7:17 pm
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన హత్రాస్ హత్యాచారం. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యుడు చంద్ర ప్రకాష్. తాజాగా ఆయన భార్య పుష్ప ప్రకాశ్ శనివారం లక్నోలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలు వయసు 36 ఏండ్లు. ఆమె తన ముగ్గురు కుమార్తెలతో రాష్ట్ర రాజధాని నగరంలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో బస చేస్తున్నారు.
Samayam Telugu హత్రాస్ విచారణ అధికారి భార్య ఆత్మహత్య


ఆమె భర్త, డీఐజీ చంద్ర ప్రకాష్. ప్రస్తుతం ఉన్నావాలోని పోలీసు శిక్షణ పాఠశాలలో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం చంద్ర ప్రకాశ్ తన కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్ప బెడ్రూంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అదనపు డిప్యూటీ కమిషనర్ (సౌత్ జోన్) సురేష్ చంద్ర, సుశాంత్ గోల్ఫ్ సిటీ పీఎస్ ఇన్స్పెక్టర్ సచిన్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పుష్ప ప్రకాశ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.

Read More: టీఆర్పీ స్కాంలో మరో నిందితుడ్ని అరెస్ట్ చేసిన ముంబై పోలీస్

చంద్రప్రకాష్‌కు చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన అత్యంత నిజాయితీపరుడని ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఈ ఘటనకు సంబంధించి వేసిన విచారణ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. అందులో చంద్రప్రకాష్ కూడా ఒకరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.