యాప్నగరం

శనివారం దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధం?

ఈసీకి లంచం ఇవ్వాలని చూసిన మహాఘనుడు టీటీవీ దినకరన్.

TNN 20 Apr 2017, 3:22 pm
ఈసీకే లంచం ఇవ్వాలని చూసిన మహాఘనుడు టీటీవీ దినకరన్. అతని అరెస్టుకు ఢిల్లీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన్ను ఢిల్లీలో శనివారం నాడు అరెస్టు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సిందిగా దినకరన్ కు సమన్లు జారీ చేశారు పోలీసులు. శనివారం నాడు ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు. బుధవారం రాత్రి చెన్నైలోని ఇంటికెళ్లి మరీ పోలీసులు దినకరన్ కు సమన్లు అందించారు. ఇప్పటికే అన్ని విమానాశ్రయాలకు, ఓడ రేవులకు దినకరన్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్రం విడిచి వెళ్లిన పోలీసులకు తెలిసిపోతుంది. కనుక ఆయన దేశం విడిచి వెళ్లడం అసాధ్యమే. దినకరన్ కు సింగపూర్ పౌరసత్వం ఉంది. అక్కడికి అతను పారిపోయే అవకాశం ఉన్నట్టు అనుమానించే పోలీసులు ముందస్తుగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. శనివారం నాడు దినకరన్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు విచారణ నిమిత్తం హాజరవుతారు. విచారణ అయ్యాక అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది.
Samayam Telugu dinakaran bribery case will he be arrested on saturday
శనివారం దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధం?


ఆర్కేనగర్ ఉపఎన్నికలో రెండాకుల గుర్తును శశికళ వర్గానికే వచ్చేలా చేయడం కోసం దినకరన్ రూ.60కోట్లను ఈసీకి లంచంగా ఇవ్వ జూపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పంపిన మధ్యవర్తి కోటిన్నర క్యాష్, రెండు ఖరీదైన కార్లతో పోలీసులకు దొరికిపోయాడు. ఆ డబ్బును తనకు దినకరన్ ఇచ్చాడని అతను పోలీసులకు చెప్పాడు. దీంతో దినకరన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దినకరన్ మాత్రం కేసులో తనను ఇరికించారని, తాను ఎవరికీ లంచం ఇవ్వాలని చూడలేదని చెప్పుకొస్తున్నాడు. ఢిల్లీ పోలీసులు మాత్రం తమ దగ్గర సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.