యాప్నగరం

ఆయనను సీఎంగా చేయాలి: దినకరన్

తమిళ తెరపైకి మూడో కృష్ణుడు?

TNN 24 Aug 2017, 11:33 am
Samayam Telugu dinakaran group new demands
ఆయనను సీఎంగా చేయాలి: దినకరన్
తమిళనాడు రాజకీయ రచ్చ ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితి అగుపించడం లేదు. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు చేతులు కలపడంతో.. పరిస్థితి అంతా సద్దుమణిగింది అనుకుంటే.. ఈ పరిణామాల పట్ల ఆగ్రహంతో దినకరన్ వర్గం మొదలుపెట్టి లొల్లి.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రతిష్టంభనగా మారింది. తన వంతుగా 17 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకుని పాండిచ్చేరిలో మకాం పెట్టాడు దినకరన్. ఓపీఎసీ, ఈపీఎస్ లు కలిసిపోయి.. తనను, తన పిన్ని శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్న తీరు పట్ల దినకరన్ ఆగ్రహంతో ఉన్నాడు. అందుకే.. తన వర్గం ఎమ్మెల్యేలతో పాండిచ్చేరిలో క్యాంపు రాజకీయం నిర్వహిస్తున్నాడు.

దినకరన్ వెంట పదిహేడు మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో ఈపీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ నేఫథ్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అటు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు దినకరన్ ఎమ్మెల్యేలు కూడా అవిశ్వాస పరీక్ష పెట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే ఆయన కేంద్ర హోం మంత్రితో సమావేశం అయ్యారు. ఇక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

ఇలాంటి నేపథ్యంలో దినకరన్ వర్గం కొత్త ప్రతిపాదన చేస్తోంది. ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తోంది. ఆయనే ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధన్‌పాల్. ఆయనను ముఖ్యమంత్రి గా చేస్తే.. తాము కూడా విలీనం అవుతామని, మద్దతును ఇస్తామని దినకరన్ వర్గం అంటోంది. ఈపీఎస్, ఓపీఎస్ లను సీఎంగా తాము ఒప్పుకోమని దినకరన్ వర్గం వాదిస్తోంది.

మరి తమిళనాట రాజకీయ రచ్చ నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. జయ మరణానంతరం విలీనాలు, చీలికలు, గ్రూపులు.. ప్రజలకు రాజకీయాలపైనే అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.