యాప్నగరం

తల్లిని దూషించాడని, తల నరికి పోలీసుల వద్దకు!

కర్ణాటకలో తల నరికివేసి నిందితుడు జైలుకు వెళ్లి లొంగిపోయిన మూడో ఘటన ఈ నెలలో చోటుచేసుకుంది.

Samayam Telugu 29 Sep 2018, 8:28 pm
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేశాడన్న కక్షతో ఓ యువకుడు మరో వ్యక్తి తల నరికేశాడు. అనంతరం నరికిన తలతో వెళ్లి నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన మాండ్యాలోని చిక్కబాగిలు గ్రామంలో జరిగింది. అయితే ఈ నెలలో కర్ణాటకలో చేసుకోసుకున్న మూడో ఘటన ఇది.
Samayam Telugu Man Behaded


మలవళ్లి పోలీసుల కథనం ప్రకారం.. ఈ చిక్కబాగిలు గ్రామానికి చెందిన పశుపతి(24) ఆటోడ్రైవర్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో శనివారం గిరీశ్(28) అనే వ్యక్తితో పశుపతికి వివాదం తలెత్తింది. పశుపతి తల్లిపై గిరీశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన పశుపతి కత్తితో గిరీశ్‌పై దాడి చేసి తల నరికేశాడు.

మొండెం నుంచి వేరుచేసిన తలను చేతిలో పట్టుకుని నేరుగా మలవళ్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గిరీశ్‌ను హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, సెప్టెంబర్ 11న చిక్‌మగళూరు జిల్లాకు చెందిన సతీశ్ అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హత్య చేశాడు. ఆపై భార్య తలతో పోలీసులకు లొంగిపోయాడు. సెప్టెంబర్ 27న చిక్కబళ్లాపూర్ జిల్లాలో అజీజ్ సద్దాం అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమె తల నరికివేశాడు. శ్రీనివాసపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.