యాప్నగరం

రాహుల్‌పై కర్ణాటక కాంగ్రెస్ నేత కామెంట్!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో మళ్లీ రాహుల్ గాంధీ ప్రతిభాపాటవాలపై చర్చ మొదలైంది.

Samayam Telugu 15 May 2018, 1:19 pm
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో మళ్లీ రాహుల్ గాంధీ ప్రతిభాపాటవాలపై చర్చ మొదలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గట్టిగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేశారీయన. అయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి జేడీఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అని కాంగ్రెస్ ఆశించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశానికి తగ్గట్టైన స్థాయిలో కూడా సీట్లను సాధించలేకపోయింది.
Samayam Telugu rahulga


భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో సీట్లను సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇక ఛాన్స్ లేనట్టే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వం మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే రాహుల్ ఒక ఆసక్తిదాయకమైన ప్రకటన కూడా చేశారు. తను ప్రధానిని కావాలనుకుంటున్నట్టుగా ప్రకటించుకున్నారాయన. ఈ నేపథ్యంలో ఈ ఎrన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఆసక్తిదాయకం.

కాంగ్రెస్ పార్టీని రాహుల్ రక్షించలేడని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేంత శక్తి రాహుల్‌కు లేదని కొంతమంది ఇప్పుడు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందించారు. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల కోసం చాలా కష్టపడ్డారని శివకుమార్ అన్నారు. రాహుల్ చేయాల్సిందంతా చేశారని, వీలైనంత సమయం కేటాయించారని.. అయితే రాహుల్‌ను తామే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదని, ఆయన ఛరిష్మాను తామే సరిగా ఉపయోగించుకోలేకపోయామని, అందుకే తమకు సీట్లు తగ్గాయని డీకే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదన్నట్టుగా ఆయన ఈ కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.